కొడకండ్ల, (ప్రజా జ్యోతి) సెప్టెంబరు 26 : వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు కొడకండ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు సట్టు సోమయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ పసునూరి మధుసూదన్ పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పసునూరి మధుసూదన్ మాట్లాడుతూచాకలి ఐలమ్మ మహిళల ఆత్మగౌరవ ప్రతీకని, తెలంగాణ అస్థిత్వానికే ఐలమ్మ ఒక సంకేతమని,తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర మాత, తెలంగాణ ప్రజల తెగువను, పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలని,సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అదేవిధంగా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన రజక సంఘం ప్రధాన కార్యదర్శి(జిల్లా రజక సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్) దూదిగాని నాగరాజు,గ్రామ రజక సంఘం కోశాధికారి (జిల్లా నాయకులు) తాడూరి రాములు,జిల్లా నాయకులు కొండ్రాతి ఉపేందర్ జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొని విజయవంతం చేశారు, అదేవిధంగా మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి-అమరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బోయిని రమేష్, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు మొహమ్మద్ శన్న,రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్,మార్గం రవీందర్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 5 views