స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : - స్టేషన్ ఘనపూర్ బుడిగ జంగాల కాలనీలో ఒకరి ఇంట్లో కొంత మంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం స్టేషన్ ఘనపూర్ ఎస్సై బండి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు మంది పేకాట రాయులని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మిగతా ఏడుగురు పరారీలో ఉన్నారని, వారి వివరాలు కళ్లెం శ్రీనివాస్, కళ్లెం ప్రతాప్, కడమంచి శ్రీధర్, కడమంచి ప్రశాంత్, మోటం మౌలయ్య, కడమంచి ప్రభు,, మోటం సింహాద్రి, మోటం రాజశేఖర్, మోటం సాయి, పస్తం శీను, మోటం మస్తాన్, పస్థం మహేష్, పస్థం మురళి, కడమంచి నరసింహ వారి వద్ద నుండి 3500 రూపాయలు, 7 సెల్ ఫోన్లు, 3 బైక్ లు, స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై బండి శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఏ ఎస్సై రవీంద్ర కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ కుమార్, రాఘవేందర్, మోహన్ లనుసిఐ అల్లె రాఘవేంద్ర అభినందించారు.
- 5 views