లక్ష్మీ నరసింహస్వామి హుండీ లెక్కింపు

Submitted by srinivas on Thu, 29/09/2022 - 09:52
Calculation of Lakshmi Narasimhaswamy Hundi

రేగొండ,సెప్టెంబర్28ప్రజాజ్యోతి.///...  మండలం  లోని లక్ష్మీనృసింహస్వామి దేవస్థానము హుండీలను   బుధవారం  లెక్కించారు.  హుండీల ద్వారా  మొత్తం  16,80,827-00 రూపాయలు ఆదాయం  వచ్చినట్టు  దేవాదాయ శాఖ పరిశీలకులు  అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఆలయ కార్యనిర్వాహణాధికారి బిల్ల శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాదాడి అనిత  కరుణాకర్ రెడ్డి, పోలీస్ అధికారులు రవీందర్, కిరణ్, మెంబర్స్  కుమారస్వామి,  సుమన్,  రాజేశ్వర్ రావు, శంకర్, నరేష్, గ్రామ పెద్దలు  శివాజీ,  భాస్కర్, ఓదెలు,  సంపత్ రావు మరియు నిమ్మల రాజు భజన బృందాలు, భక్తులు పాల్గొన్నారు.