మృతుల కుటుంబాన్ని పరామర్శించిన భాజపా నాయకులు

Submitted by sridhar on Tue, 06/09/2022 - 18:19
BJP leaders visited the family of the deceased

వాజేడు, సెప్టెంబర్ 6, ప్రజాజ్యోతి: వాజేడు మండలంలోని చింతూరు గ్రామానికి చెందిన తోటపల్లి రమేష్, స్వరూప దంపతులు రెండు రోజుల క్రితం మండలంలోని సుందరయ్య కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసినదే ఐతే మంగళవారం భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీష్ కుమార్ వాజేడు మండల భాజపా నాయకులతో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించి ఆకుటుంబానికి 25 కేజీల బియ్యం, రెండువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల భాజపా అధ్యక్షుడు కందుల రామ్ కిషోర్, మండల ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రవీందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు జగపతిబాబు, మరికాల ఎంపీటీసీ లక్ష్మీశేఖర్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.