దేవరుప్పులలో బిజెపి మండల కార్యవర్గ సమావేశం

Submitted by lenin guduru on Sat, 03/12/2022 - 19:05
Bjp

దేవరుప్పులలో బిజెపి మండల కార్యవర్గ సమావేశం

దేవరుప్పుల,డిసెంబర్ 03, (ప్రజాజ్యోతి):-


 మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు భాగాల నవీన్ రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధనకార్యదర్శి సౌడ రమేష్ హాజరై మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలని ఇందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళిత యువకులను మోసం చేస్తూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పాలకుర్తి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఇలా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ఓట్లను దండుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ప్రజలు రాబోయే ఎన్నికల్లో బొంద పెట్టుడు కాయం అని అన్నారు. భారతీయ జనతా పార్టీని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మడికొండ మహేష్, పాలడుగు ఉప్పలయ్య, స్వామి, వెంకన్న  నర్సింహ, భాస్కర్, ఉదయ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.