యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో పోస్టర్ ఆవిష్కరణ

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 17:10
Bharat Jodo poster unveiled under the auspices of the Youth Congress

కరీంనగర్, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో నగరంలోని హైమద్ పుర చౌరస్తా లో ఆదివారం యూత్ జోడో బూత్ జోడో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మాజిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 ప్రారంభమయే భారత్ జోడో యాత్రలో యువత, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మాజిద్ ఖాన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో 8 సంత్సరకాలంగా 16 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, గ్యాస్, పెట్రోల్, డిజిల్, నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇమ్రాన్, సమద్ నవాబ్, టిపిసిసి ఆర్గనైజషన్ సెక్రటరీ, జిల్లా మైనారిటీ సెక్రటరీ ఫెరోజ్, శాయభాజ్, ఉల్లాహ్ ఖాన్, అజీజ్, వాసీమ్, అబోడ్, ఉమర్, అబ్రర్, పాషా జగ్గీయ, కరణ్, సల్మాన్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.