-మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరికలు
నాంపల్లి,అక్టోబర్ 3(ప్రజాజ్యోతి): తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా శ్రీ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాంపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలతో కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కలిసి బతుకమ్మ ఆట, పాటల కోలాటం సంబరాలలో పాల్గొన్నారు.అదేవిధంగా మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నుండి బిజెపిలో భారీ చేరికలు జరిగాయి.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ వేడుకల్లో పాల్గొన్న 2 వేల మందికి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి,మండల నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి,పూల వెంకటయ్య,సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి,పెద్దిరెడ్డి సంజీవ రాజు రెడ్డి,ప్రధాన కార్యదర్శి సింగారపు గిరి ముదిరాజ్, చంద్రారెడ్డి , రాజశేఖర్ రెడ్డి, దోటి పరమేష్, గాదెపాక రాజు, కామిశెట్టి నాగరాజు, నరేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- 2 views