మూలా నక్షత్ర దీపారాధన భక్తులకు విన్నపం

Submitted by Thirumal on Thu, 15/09/2022 - 15:36
 An appeal to the devotees of Mula Nakshatra Dipradhana

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ కేంద్రములో శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్ర దీపారాధన చేయు భక్తులకు చేయు విన్నపం ఏమనగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఎల్కూరు రాఘవేంద్రరావు, విఠలాపురం రుక్మాంగద రావు, బిజెపి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో నిరాఘాటంగా కొనసాగి ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి సమ్మతితో దేవాలయం ఆధ్వర్యంలో మూలా నక్షత్ర దీపారాధన నిర్వహించుటకు చర్యలు తీసుకున్నారు, ఇందుకుగాను గతంలో    సమకూరిన సహకారంతో దీపపు ట్రే దేవస్థానం వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు, ఈ సంవత్సరం కూడా దేవాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తారీఖున మూలా నక్షత్ర దీపోత్సవ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నారు. భక్తాదులు దేవాలయ కార్యాలయంలో మూలా నక్షత్ర దీపోత్సవానికి సేవా రుసుము చెల్లించి రసీదు పొందాలని వారు తెలిపారు.