- బుద్ధవనాన్ని సందర్శిస్తున్న విదేశి రాయబారి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్
హలియా,(నాగార్జునసాగర్) సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): భారత్ దేశం తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ గల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుద్ధవనాన్ని బుధవారం నాడు మాంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ సందర్శించారు. సందర్శనలో ఆయన వెంట నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య ఉన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ణ బ్రహ్మ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ,కౌన్సిలర్లు రామకృష్ణ,రమేష్ జి,పట్టణ యూత్ అధ్యక్షుడు ఆవుల దొడ్డి రాహుల్, కామెర్ల జానయ్య,తాటి సత్యపాల్, తదితరులు పాల్గొన్నారు.
- 1 view