బిజెపి పార్టీలో చేరిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు

Submitted by mallesh on Sun, 25/09/2022 - 11:40
Activists of TRS and Congress parties who joined the BJP party

చౌటుప్పల్ సెప్టెంబర్ 24( ప్రజా జ్యోతి) ..//. మునుగోడు ఉప ఎన్నికలో  బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పక విజయం సాధిస్తారని జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం దేవలమ్మ నగరలోని  టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన 30 మంది ముదిరాజ్ కుటుంబాలను చిలుకూరి ప్రభాకర్ రెడ్డి బిజెపి  పార్టీలోకి ఆహ్వానించారు. చెరువు కట్టమీద నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మతల్లి దేవాలయం నిర్మాణం కు ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదని, ప్రజల సంక్షేమం భవిష్యత్ కోసం వచ్చిన ఎన్నిక అన్నారు. బిజెపి పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ లాగా కోట్ల దోచుకున్న పార్టీ కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమన గోని శంకర్, దూడల బిక్ష గౌడ్, రిక్కల సుధాకర్ రెడ్డి, ఉబ్బు వెంకటయ్య, ఉడుగు వెంకటేశం, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బక్క శ్రీనాథ్, సిలివేరు రమేష్ , సురుగు శ్రీనివాస్ గౌడ్, రేవల్లి సత్యనారాయణ, సురుగు మల్లేష్ గౌడ్, అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, గట్టు సుధాకర్, పులిగిల్ల శ్రీనివాస్ చారి, వీరేష్, గట్టు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.