చెక్ పోస్ట్ కార్యాలయం ప్రారంభించిన ఎసిపి వెంకటేష్
కల్లూరు, సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి
కల్లూరు మండల పరిధిలోని చంద్య తండా వద్ద ఖమ్మం వెళ్ళే రోడ్ నందు నూతనంగా నిర్మించిన పోలీస్ చెక్ పోస్ట్ కార్యాలయం ను సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కల్లూరు ఎసిపి వెంకటేష్ ముఖ్య అతిథిగా మంగళ వారం పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు బదిలీపై వెళ్తున్న ఎస్సై వెంకటేష్,నూతనంగా భాద్యతలు తీసుకున్న ఎస్సై బలుగూరి కొండలరావు , పోలీస్ సిబ్బంది హనుమా తండా వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
- 8 views