రోడ్డు ప్రమాదంలో టిఆర్ఎస్ కార్యకర్త మృతి
-
నివాళులర్పించి కంటతడి పెట్టిన జనగామ జడ్పీ వైస్ చైర్మన్
బచ్చన్నపేట నవంబర్ 30, (ప్రజాజ్యోతి):- జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త,
ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్న మోతే రామస్వామి
సోమవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. రామస్వామి
మృతదేహానికి జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య గోపాల్ నగర్ గ్రామంలో పూలమాల వేసి నివాళులు
అర్పించి, ఒక్కసారిగా కంటతడి పెట్టారు. బేడ బుడగ జంగాల కులానికి చెందిన రామస్వామి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు
చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తగా, పార్టీ గురించి కష్టపడుతూ ఉండేవాడని, అతని మరణం తీరని లోటని జనగామ జడ్పీ వైస్ చైర్మన్
గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా గోపాల్
నగర్ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ ఉప సర్పంచ్ వద్ది ఎల్లయ్య,టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుర్రపు రమేష్, వార్డ్ మెంబర్లు పరశు
రాములు బొమ్మన నర్సింలు, ప్రసన్న, నాయకులు పర్వతం ఐలయ్య,సిరిపాటి రామదాస్, చింతల వెంకటయ్య, పర్వతం యాదగిరి, సిరి
పటిఅరుణ్ కుమార్, చింతల కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
- 38 views