సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉంది అభినందన్ రెడ్డి

Submitted by mallesh on Mon, 03/10/2022 - 14:40
Abhinandan Reddy is at the forefront of implementation of welfare schemes in Telangana

చౌటుప్పల్ అక్టోబర్ 2( ప్రజా జ్యోతి):   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే ముందంజలో ఉన్నదని టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు నారెడ్డి అభినందన్ రెడ్డి అన్నారు.ఆదివారం చౌటుప్పల్ లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ మండల యువజన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, తన సొంత స్వలాభం కోసం రాజగోపాల్ రెడ్డి ఇచ్చే డబ్బులకు  అమ్ముడుపోయారన్నారు. నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి నీ తీవ్రంగా వ్యతిరేకించిన తాడూరి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి  చెంచా గా మారి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ ల నాయకత్వం ను తప్పు పట్టడాన్ని అభినందన రెడ్డి తీవ్రంగా ఖండించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి బిజెపి నాయకత్వం నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. మునుగోడు గడ్డమీద టిఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కట్ట రంగనాథ్, కరింగు సతీష్, రంగారెడ్డి ,వనం మహేందర్ ,మహేష్ ,గుడ్డేటి రమేష్ ,సాయి కృష్ణ ,శ్రీకాంత్ ,సాయి ,కొప్పూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.